కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts
కొత్త దంపతులు సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయాలి?
Spread the loveSpread the loveTweetవివాహం తరువాత నూతన వధూవరులు తప్పనిసరిగా సత్యానారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆచరించాలి కూడా. ఇది సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కేవలం నూతన దంపతులే…
Spread the love
Spread the loveTweetవివాహం తరువాత నూతన వధూవరులు తప్పనిసరిగా సత్యానారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆచరించాలి కూడా. ఇది సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కేవలం నూతన దంపతులే…
శరన్నవరాత్రులుః సరస్వతి దేవి అలంకరణ విశిష్టత
Spread the loveSpread the loveTweetదసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మూల నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరిస్తారు. విద్య, జ్ఞానం, కళలు, సంగీతం, సాహిత్యం వంటి అనేక కళలకు…
Spread the love
Spread the loveTweetదసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మూల నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరిస్తారు. విద్య, జ్ఞానం, కళలు, సంగీతం, సాహిత్యం వంటి అనేక కళలకు…