కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts
గోవిందరాజ స్వామి ముత్యపు పందిరి వాహన సేవ
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి…
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి…
రాశిఫలాలు – 2026, జనవరి 12, సోమవారం
2026 జనవరి 12, సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్య మాసం, బహుళ పక్ష నవమి తిథి, స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రాధిపతి వాయుదేవుడు. ఈ…
2026 జనవరి 12, సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్య మాసం, బహుళ పక్ష నవమి తిథి, స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రాధిపతి వాయుదేవుడు. ఈ…
ఆటో డ్రైవర్ల సమస్యకు హైడ్రా శాశ్వత పరిష్కారం
హైదరాబాద్లో ప్రధాన సమస్య ట్రాఫిక్, పార్కింగ్. ఈ రెండు సమస్యలు ప్రజలను వాహనదారులను ఎంతగానో ఇబ్బంది పెడుతుంటాయి. వీటినుంచి బయటపడేందుకు అటు అధికారులు కృషి చేస్తున్నప్పటికీ పెరుగుతున్న…
హైదరాబాద్లో ప్రధాన సమస్య ట్రాఫిక్, పార్కింగ్. ఈ రెండు సమస్యలు ప్రజలను వాహనదారులను ఎంతగానో ఇబ్బంది పెడుతుంటాయి. వీటినుంచి బయటపడేందుకు అటు అధికారులు కృషి చేస్తున్నప్పటికీ పెరుగుతున్న…