వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Latest News, Analysis, Trending Stories in Telugu