శ్రీశైలం భ్రమరాంబ దేవి అద్భుతం – తుమ్మెద రూపంలో శక్తి జ్ఞాన ధ్యాన వైభవం
“అమ్మ దయ ఉంటే అన్నీ సులభం!”
ఈ మాట మన పెద్దలు తరచుగా చెప్తుంటారు. అలాంటి తల్లి – భక్తుల పాపాలను, లోకంలో ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా అనేక రూపాల్లో అవతరించి రాక్షస సంహారం చేసిన దేవి మన భ్రమరాంబ అమ్మవారు.
ఆమె తీసుకున్న ఒక ప్రత్యేకమైన రూపం “భ్రమరా” రూపం – అంటే తుమ్మెద రూపం.
భ్రామరీ నాదం – భక్తి వేళ్లలో కంపించే శక్తి ధ్వని
శ్రీశైలంలోని భ్రమరాంబా అమ్మవారి గర్భగుడి వెనుక భాగంలో నిశ్శబ్దంగా కూర్చుంటే, కళ్ళు మూసుకుని చెవులను ఒత్తుకుని ఉన్నపుడు, ఓ తుమ్మెద తరహా “ఝుం…ఝుం…” చేసే శబ్ధం వినిపిస్తుంది. ఇది అనుభవించినవారు చాలా మంది.
ఈ శబ్దాన్ని “భ్రామరీ నాదం” అంటారు. ఈ ధ్వని శాశ్వతంగా అక్కడ ప్రకంపించే శక్తిగా భావించబడుతుంది. ఆవిడ తుమ్మెద రూపంలో రెక్కల చప్పుడుగా ఈ నాదం కొనసాగుతుందని ప్రతీతి. ఇదే ఆ మహత్తర క్షేత్ర విశేషం.
కుంకుమార్చన చేయగానే తల్లి అనుగ్రహిస్తే…
భ్రమరాంబ అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేయడం ఎంతో శుభకార్యమైనది.
ఆ అనుభవం ఓ స్త్రీ జీవితాన్ని మార్చేస్తుంది:
- ఆమెకు మూడు తరాలు పుణ్యం కలుగుతుంది,
- పదిమందికి ఆడపడుచుగా కనిపిస్తుంది,
- వృద్ధాప్యంలో భర్త మడిపైన తలపెట్టి శాంతియుతంగా జీవితం ముగించుకునే అదృష్టం లభిస్తుంది.
ఇది కేవలం పౌరాణిక విశ్వాసం కాదు – శ్రద్ధ ఉన్న ప్రతి నమ్మకదారుడికి తల్లి అనుగ్రహం వాస్తవం అవుతుంది.
తేనెతో అభిషేకం – గంధర్వ గానానికి జన్మతరం ప్రసాదం
శివలింగాన్ని తేనెతో అభిషేకం చేయడం వల్ల తదుపరి జన్మలో గంధర్వ గానం ప్రాప్తించుతుంది అని పురాణాలు చెప్తున్నాయి.
నాలుగు మారేడు దళాలు తీసుకెళ్లి శివలింగాన్ని తడిమి తడిమి అభిషేకించాలి. ఇది శరీరంలోని నర నాడుల్లో భక్తి జ్ఞాన ప్రకాశాన్ని నింపుతుంది.
అరుణాసుర సంహారంలో తల్లి భయంకర తుమ్మెదగా మారింది
పూర్వ కాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో దేవతలను కూడా దిగజార్చాడు.
వాడు “స్త్రీలు తప్ప మరెవ్వరూ నన్ను సంహరించలేరు” అనే వరం పొంది ఉన్నాడు. అప్పుడు అమ్మవారు భ్రమర రూపం (తుమ్మెదలుగా) అవతరించి అతడిని సంహరించారు.
ఈ సంఘటన శక్తి యొక్క మేధస్సు, సంకల్ప బలానికి ప్రతీక.
శ్రీశైలం – శివ శక్తుల కలయిక
శాస్త్రాల ప్రకారం,
- మల్లికార్జునుడు అంటే మల్లెపూవుల మధ్య మెరిసే శివుడు
- భ్రమరాంబా అంటే పువ్వుల చుట్టూ తిరుగే తుమ్మెద – శక్తి స్వరూపిణి
ఇక్కడ శివుడు ఉన్న చోటే, తల్లి శక్తిరూపంలో తిరుగుతూ ఉంటారు.
ఈ సమైక్యతకి గుర్తుగా ఈ నాదం ఇప్పటికీ వినిపిస్తుందని ఆలిండియా రేడియో కూడా రికార్డు చేసింది.
సౌందర్య లహరి పఠనం – జ్ఞానదీప్తి తల్లి అనుగ్రహం
శ్రీచక్రం ముందు కూర్చుని,
“అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ…”
అని సౌందర్య లహరిలోని నాలుగు శ్లోకాలు పఠిస్తే – జన్మ ధన్యమవుతుంది
కృష్ణా నది కాదు – పాతాళగంగ!
ఇక్కడ ప్రవహించే నదిని కృష్ణానది కాదు, పాతాళగంగ అని పిలుస్తారు. ఎందుకంటే ఉత్తరభాగంలో ఉన్న గంగ, శివుని విడిచిపెట్టలేక దక్షిణంగా శ్రీశైలానికి వచ్చి చుట్టూ వలయంగా ప్రవహిస్తుంది. ఇది తల్లి భక్తుల పాపాలను పోగొట్టే మహా కృప.
ఆలయ నిర్మాణం, పాండవుల లింగాలు, త్రిఫల వృక్షం
- తూర్పున: శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం
- దక్షిణం: హరిహర రాయలవారి గోపురం
- ఆలయంలో పాండవుల ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలు
- త్రిఫల వృక్షం – మేడి, జువ్వి, రావి కలిపిన చెట్టు – నాలుగు వేల ఏళ్ల ప్రాచీనత్వం
శివాజీ మహారాజుకు తల్లి బహుమతిగా చంద్రహాసం
శివాజీ మహారాజు శ్రీశైలానికి వచ్చి భక్తితో ప్రార్థించాడు.
అప్పుడు భవానీ మాత ప్రత్యక్షమై
“ఈ చంద్రహాసము చేత పట్టుకో – నీకు ఎదురు లేదు” అని ఆశీర్వదించి ఆయుధం ఇచ్చింది.
ఈ కత్తి పట్టుకొని శివాజీ హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ఘట్టం ఇప్పటికీ శివాజీ గోపురం పై చెక్కబడి ఉంటుంది.