షాకింగ్‌న్యూస్ః మహారాష్ట్రలో విమాన ప్రమాదం…డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి

Shocking News Maharashtra Deputy CM Ajit Pawar Killed in Baramati Plane Crash

మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌ కావలసి ఉండగా… విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అజిత్‌ పవార్‌తో పాటు మరో నలుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 వరకు మొత్తం మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. దీని కోసం ఉదయం ఆయన ముంబై నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే, బారామతి రన్‌వేపై ల్యాండింగ్‌ అయ్యేందుకు విమానం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఒక్కసారిగా నేలపై కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *