తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢంలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, ఆషాఢం నడుస్తున్నప్పటికీ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అపారంగా పెరిగిపోతున్నది. ఆదివారం అంటే జులై 13వ తేదీన తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఒక్కరోజే 80,193 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇక 33,298 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్టుగా అధికారులు తెలిపారు. ఆదివారం రోజున హుండీ ద్వారా 4.43 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. సాధారణ భక్తుల దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక శనివారం రోజున రికార్డుస్థాయిలో భక్తులు శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శనివారంనాడు స్వామిని 92,221 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 42,280 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లో ఉన్నవారికి అన్నపానీయాలు అందజేస్తున్నారు. క్యూకాంప్లెక్సులో ఉన్న వారికి కూడా ఆహారాన్ని అందిస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Related Posts
ట్రంప్ టారీఫ్ ముచ్చట్లు
Spread the loveSpread the loveTweetఅమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ ప్రతి అంశాన్ని ఆర్థికవిషయాలతో ముడిపెడుతున్నాడు. ప్రపంచదేశాలపై టారిఫ్లు విధిస్తూ ఘనత సాధించినట్టుగా చెప్పుకుంటున్నాడు. ట్రంప్…
Spread the love
Spread the loveTweetఅమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ ప్రతి అంశాన్ని ఆర్థికవిషయాలతో ముడిపెడుతున్నాడు. ప్రపంచదేశాలపై టారిఫ్లు విధిస్తూ ఘనత సాధించినట్టుగా చెప్పుకుంటున్నాడు. ట్రంప్…
వైద్య కళాశాల ప్రైవేటీకరణ కు నిరసనగా 11వ ర్యాలీ
Spread the loveSpread the loveTweetజగన్ ప్రభుత్వ హాయాంలో పేదొడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో మా పార్టీ అధినేత ఏర్పాటు స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ…
Spread the love
Spread the loveTweetజగన్ ప్రభుత్వ హాయాంలో పేదొడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో మా పార్టీ అధినేత ఏర్పాటు స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ…
కర్నూల్ బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Spread the loveSpread the loveTweetకర్నూల్ బస్సు ప్రమాదం లో అంతకంతకు మృతుల సంఖ్యా పెరుగుతుంది… అలానే ఈ ఘోరమైన ఘటన లో మృతుల కుటుంబాలకు AP CM చంద్ర…
Spread the love
Spread the loveTweetకర్నూల్ బస్సు ప్రమాదం లో అంతకంతకు మృతుల సంఖ్యా పెరుగుతుంది… అలానే ఈ ఘోరమైన ఘటన లో మృతుల కుటుంబాలకు AP CM చంద్ర…