తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢంలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, ఆషాఢం నడుస్తున్నప్పటికీ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అపారంగా పెరిగిపోతున్నది. ఆదివారం అంటే జులై 13వ తేదీన తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఒక్కరోజే 80,193 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇక 33,298 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్టుగా అధికారులు తెలిపారు. ఆదివారం రోజున హుండీ ద్వారా 4.43 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. సాధారణ భక్తుల దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక శనివారం రోజున రికార్డుస్థాయిలో భక్తులు శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శనివారంనాడు స్వామిని 92,221 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 42,280 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లో ఉన్నవారికి అన్నపానీయాలు అందజేస్తున్నారు. క్యూకాంప్లెక్సులో ఉన్న వారికి కూడా ఆహారాన్ని అందిస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Related Posts
ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్…
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలకమైన పల్లె పోరు ముగిసింది. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఊహించినదానికంటే భారీ విజయాన్ని నమోదు…
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలకమైన పల్లె పోరు ముగిసింది. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఊహించినదానికంటే భారీ విజయాన్ని నమోదు…
సర్పరూపంలో సుబ్బారాయుడి దర్శనం
సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించిన వారికి సంతానం కలుగుతుంది. కానీ, ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని ఆరాధించిన వారి కోరికలు నెరవేరడమే కాకుండా క్రమశిక్షణ కలిగిన జీవితం కూడా అలవడుతుంది. జీవితంలో క్రమశిక్షణ…
సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించిన వారికి సంతానం కలుగుతుంది. కానీ, ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని ఆరాధించిన వారి కోరికలు నెరవేరడమే కాకుండా క్రమశిక్షణ కలిగిన జీవితం కూడా అలవడుతుంది. జీవితంలో క్రమశిక్షణ…
లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో బీజేపీ ఓ అద్భత నిర్మాణాన్ని చేపట్టింది. కమలం ఆకృతిలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 232 కోట్ల…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో బీజేపీ ఓ అద్భత నిర్మాణాన్ని చేపట్టింది. కమలం ఆకృతిలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 232 కోట్ల…