తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢంలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, ఆషాఢం నడుస్తున్నప్పటికీ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అపారంగా పెరిగిపోతున్నది. ఆదివారం అంటే జులై 13వ తేదీన తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఒక్కరోజే 80,193 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇక 33,298 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్టుగా అధికారులు తెలిపారు. ఆదివారం రోజున హుండీ ద్వారా 4.43 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. సాధారణ భక్తుల దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక శనివారం రోజున రికార్డుస్థాయిలో భక్తులు శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శనివారంనాడు స్వామిని 92,221 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 42,280 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లో ఉన్నవారికి అన్నపానీయాలు అందజేస్తున్నారు. క్యూకాంప్లెక్సులో ఉన్న వారికి కూడా ఆహారాన్ని అందిస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Related Posts
రామ్ చరణ్కు గాయంపై ‘పెద్ది’ టీమ్ క్లారిటీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడినట్లు వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ టీమ్ అధికారికంగా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడినట్లు వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ టీమ్ అధికారికంగా…
Ram Gopal Varma Drops A Cryptic Post On ‘I-Bomma’ Ravi…
It is all known that Telangana Police especially Hyderabad City Police Commissioner V.C. Sajjanar’s determination caught the mastermind behind I-Bomma…
It is all known that Telangana Police especially Hyderabad City Police Commissioner V.C. Sajjanar’s determination caught the mastermind behind I-Bomma…
కళ్లకు గంతలు కట్టుకుంటేనే…అమ్మవారి దర్శనం
ఉత్తర గుజరాత్ సరిహద్దుల్లో, అరావళీ పర్వతాల నడుమ నిశ్శబ్దంగా, ఆధ్యాత్మిక శక్తితో నిండిన అంబాజీ మాత ఆలయం భక్తులకు అమోఘమైన అనుభూతిని అందిస్తుంది. దసరా సమయంలో ఈ…
ఉత్తర గుజరాత్ సరిహద్దుల్లో, అరావళీ పర్వతాల నడుమ నిశ్శబ్దంగా, ఆధ్యాత్మిక శక్తితో నిండిన అంబాజీ మాత ఆలయం భక్తులకు అమోఘమైన అనుభూతిని అందిస్తుంది. దసరా సమయంలో ఈ…