తిరుమలలో స్వామివారి అభిషేకానికి పాలిచ్చే ఆవులు మరణిస్తే…

శ్రీవారికి నిత్యం గోక్షీరంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి అవసరమైన పాలను, పాలనుంచి లభించే వెన్న, నెయ్యిని తిరుమలలో పలు రకాలైన ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే, ఇలా క్షీరాన్ని అందించే గోవులు మరణిస్తే వాటికి నిర్వహించే దహనసంస్కారాలు వైభవంగా జరుగుతాయి. వేద మంత్రాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సంస్కృతి ఉండదు. మనిషికి కూడా ఇలాంటి సంస్కారాలు నిర్వహించరు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. అంతిమ సంస్కారం సమయంలో వారిని తలచుకుంటూ వారికి కృతజ్ఞతలు చెబుతూ, వీడ్కోలు పలుకుతారు. ఇక్కడ ఇచ్చిన వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి గోవులను ఆరాధించడం నేర్చుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *