సూర్యదోషం ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు మంచం కింద రాగిపాత్రలో నీటిని నింపి పెట్టుకోవాలి. చంద్రదోషం నుంచి బయటపడాలంటే వెండి పాత్రలో నీటిని పోసి మంచంకింద ఉంచుకోవడంగాని లేదా వెండి ఆభరణాలను దిండుకింద ఉంచుకోవడంగాని చేయాలి. మంగళదోషం నుంచి బయటపడాలంటే కంచు పాత్రలో నీటిని పోసి మంచం కింద ఉంచుకోవాలి. జాతకంలో బుధ దోషం ఉన్నట్టైతే రాత్రి పడుకునే ముందు దిండుకింద బంగారు ఆభరణాలను ఉంచుకోవాలి. గురుదోషం ఉన్నవారు పసుపు ముద్దను గుడ్డలో చుట్టి తలకిందపెట్టుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా నుదిటిపై తిలకం దిద్దుకోవడం వలన రాహు దోషం నుంచి బయటపడతారు. జంతువులకు ఆహారాన్ని అందించడం వలన కేతువు సంతోషిస్తాడు. ఫలితంగా ఈ దోషం ఉన్నవారికి మంచి చేస్తాడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వెండి చేపను దిండుకింద ఉంచుకోవాలి. నీలం రంగు రత్నాన్ని దిండుకింద ఉంచుకోవడమో లేదా ఇనుప పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోవడమో చేయడం వలన శనీశ్వరుని దోషం నుంచి బయటపడతారు.
Related Posts
పూరీ జగన్నాథ రథయాత్ర – తిరుగు ప్రయాణం ఎలా సాగుతుంది?
పూరీ రథయాత్ర వెనుక గొప్ప ఆధ్యాత్మిక గాధ పూరీ జగన్నాథ రథయాత్ర అనేది ప్రపంచంలోనే అత్యంత గొప్ప హిందూ ఉత్సవాల్లో ఒకటి. మామూలుగా మనం రథయాత్ర అంటే…
పూరీ రథయాత్ర వెనుక గొప్ప ఆధ్యాత్మిక గాధ పూరీ జగన్నాథ రథయాత్ర అనేది ప్రపంచంలోనే అత్యంత గొప్ప హిందూ ఉత్సవాల్లో ఒకటి. మామూలుగా మనం రథయాత్ర అంటే…
వందేళ్లు ఎలా బతకాలి…జపాన్ వాసులు చెబుతున్న సత్యాలు
ప్రపంచంలో వందేళ్లు దాటిన పెద్దవారి సంఖ్యలో ముందున్న దేశం జపాన్. అక్కడ వృద్ధులు కేవలం బతికే వారే కాదు – ఉత్సాహంగా, ఆనందంగా జీవించే వారే! ఈ…
ప్రపంచంలో వందేళ్లు దాటిన పెద్దవారి సంఖ్యలో ముందున్న దేశం జపాన్. అక్కడ వృద్ధులు కేవలం బతికే వారే కాదు – ఉత్సాహంగా, ఆనందంగా జీవించే వారే! ఈ…
Santhana Prapthirasthu Success Meet Live
Post Views: 47
Post Views: 47