తుమ్మిపువ్వులు గడ్డిజాతికి చెందిన మొక్కలు. సాధారణంగా ఇవి రోడ్డు పక్కన, పొలం గట్లమీద పెరుగుతుంటాయి. వీటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఈ పువ్వులు మహాశివుడిని అత్యంత ఇష్టమైనవిగా చెబుతారు. ఈ తుమ్మి పువ్వులను భూతనాశక అని పురాణాలు చెబుతున్నాయి. ఇది చెడు శక్తులను తొలగించే శక్తి కలిగి ఉందని విశ్వాసం. ఈ పువ్వుల పేరుమీదగానే శివుడిని భూతనాధుడు అని పిలుస్తారు. భూతగణాలకు ఆయన అధిపతి. తుమ్మి పువ్వులు భూతగణాలను ప్రసన్నం చేస్తాయని, అందువలన శివుడి ఆరాధనలో వీటిని ఉపయోగిస్తారు. తుమ్మిచెట్టు శరీరాన్ని శుద్ధి చేసే తత్వాన్ని, రోగనాశనం చేసే గుణాలను కలిగి ఉంటుంది. మహాశివుడు శుద్దతకు ప్రతీక. అందుకే ఈ పువ్వులు శివారాధనలో తప్పకుండా ఉపయోగించాలని అంటారు. శివుని పూజలు తుమ్మి పువ్వులను సమర్పించడం వలన దోషాలు తొలగిపోతాయి. చేసిన పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. అలంకరణ తత్వం లేని భగవంతుడు మహాశివుడు. అందుకే చిన్నదైన, సాధారణమైన తుమ్మిపువ్వును మహాశివుడిని శ్రద్ధతో సమర్పిస్తే ఆయన తృప్తి చెందుతారని, భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. ఒక్క తుమ్మిపువ్వుతో శివుడిని పూజిస్తే సహస్ర పుష్పార్చన చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
Related Posts
పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు…
ఇంకా ఒక రోజులో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా రిలీజ్ కాబోతుంది. ఈరోజు నుంచే పేడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు.…
ఇంకా ఒక రోజులో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా రిలీజ్ కాబోతుంది. ఈరోజు నుంచే పేడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు.…
వండువ ఇనాం భూముల రైతుల్ని అన్నదాత సుఖీభవ జాబితాలో చేర్చండి – AP డిప్యూటీ సీఎం
సమావేశంలో ముఖ్య అంశాలు:•జాబితా సవరించి న్యాయం చేయాలి•మన్యం జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఇనాం భూములు, డీకేటీ పట్టాలు ఉన్న…
సమావేశంలో ముఖ్య అంశాలు:•జాబితా సవరించి న్యాయం చేయాలి•మన్యం జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఇనాం భూములు, డీకేటీ పట్టాలు ఉన్న…
అప్పనపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం – కొబ్బరికాయలో వెలసిన వైభవం
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అప్పనపల్లి గ్రామం, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర భూమి.…
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అప్పనపల్లి గ్రామం, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర భూమి.…