కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఎదురుచూసిన భారీ కంబ్యాక్ చివరికి “కరుప్పు” (తెలుగులో ‘వీరభద్రుడు’) రూపంలో దొరికింది. విడుదలైనప్పటి నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలుస్తోంది.
విడుదలైన కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 207 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి వారం ముగిసేలోపే 200 కోట్ల మార్క్ను దాటడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ స్థాయి కలెక్షన్లు సూర్య అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
ఇప్పుడు ఈ సినిమాకు ముందున్న లక్ష్యం 300 కోట్ల గ్రాస్ మార్క్ అని ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రన్ కొనసాగితే కోలీవుడ్లో మరో భారీ హిట్గా “వీరభద్రుడు” నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా సెకండ్ వీక్లో వచ్చే వసూళ్లు ఈ టార్గెట్ను చేరడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ చిత్రానికి దర్శకుడిగా ఆర్జే బాలాజీ వ్యవహరించగా, సంగీతాన్ని సాయి అభ్యంకార్ అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా యాక్షన్, ఎమోషన్ కలయికతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సూర్య నటనకు మంచి ప్రశంసలు లభిస్తుండటంతో పాటు, థియేటర్లలో ప్రేక్షకుల రష్ కూడా కొనసాగుతోంది. మొత్తానికి “వీరభద్రుడు” సూర్యకు ఒక బలమైన రీ-ఎంట్రీగా నిలిచిందని చెప్పవచ్చు.