ప్రపంచంలో మరో కొత్త కూటమికి శ్రీకారం

వెస్ట్రన్‌ దేశాల నుంచి రక్షణ కోసం, దేశాల ఆర్థిక విధానంలో డాలర్‌తో మారక విలువను తగ్గించడం కోసం కూటములను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సదస్సులో మూడు దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అవే ఇండియా, బ్రెజిల్‌, సౌతాఫ్రికా. ఈ మూడు దేశాలు కలిసి ఇబ్సా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ మూడు దేశాల మధ్య జరిగే ట్రేడింగ్‌ ఇకపై పూర్తిగా యూపీఐ ద్వారానే జరగనుంది. యూపీఐకి ప్రాధాన్యత ఇవ్వడంతో డాలర్‌తో మారకం తగ్గిపోతుంది. వీలైనంత త్వరగా డాలర్‌ను ట్రేడింగ్‌ నుంచి పక్కకు తప్పించి సొంత కరెన్సీని వినియోగించాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు దేశాలు ఇబ్సా పేరుతో నిథిని కూడా ఏర్పాటు చేశాయి. ఈ నిథిని విద్య, వైద్యం వంటి సామాజిక రంగాల కోసం వినియోగిస్తున్నారు. ఇబ్సాను మరింత బలోపేతం చేయాలని ఈ మూడు దేశాలు నిర్ణయించాయి.

అయోధ్యలో పండుగ వాతావరణం…ఎటు చూసినా ఆనందమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *