గొప్ప సంఘటనలు
1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.
1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.
2008: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్సవత్ ఎన్నికైనాడు.
జననాలు
1879: పెరియార్ రామస్వామి నాయకర్ ఉద్యమకారుడు, రాజకీయనాయకుడు, సంఘసంస్కర్త, నాస్తికవాది జననం
1906: వావిలాల గోపాలకృష్ణయ్య, గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడి జననం
1915: ఎమ్.ఎఫ్. హుస్సేన్, భారతీయ చిత్రకారుడి జననం
1943: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త జననం
1950: భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మించారు.
1986: ప్రియా ఆనంద్, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, తెలుగు, చిత్రాల నటి జననం
1990 బండారు శివప్రసాద్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు.
మరణాలు
1922: ముత్తరాజు సుబ్బారావుః శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది.
1999: రాజేశ్వర్ దయాళ్ః భారతీయ దౌత్యవేత్త, రచయిత.
జాతీయ దినాలు- పండుగలు
తెలంగాణ విమోచన దినోత్సవం
విశ్వకర్మ జయంతి
మహిళల మైత్రీ దినోత్సవం
ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే