కరూరులో ఘోర విషాదం – ప్రగాఢ సానుభూతి ప్రకటించిన విజయ్…

తమిళనాడులోని కరూరులో నిన్న జరిగిన భయానక సంఘటన దేశమంతటినీ కలచివేసింది. భారీ ప్రాణనష్టం కలిగించిన ఈ విషాదం ప్రతి ఒక్కరి మనసును కుదిపేసింది. ఆ బీభత్సంలో అమాయకులైన పలువురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయాలతో మృత్యువుతో పోరాడటం చూసి అందరి హృదయం భారమైంది. ఈ నేపథ్యంలో, బాధలో మునిగిపోయిన బాధిత కుటుంబాలకు ఓదార్పు కలిగించేలా విజయ్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు… అయన నిన్ననే ఈ సంఘటన పై స్పందించి, భాదిత కుటుంభాలకి తోడు గా ఉంటాను అన్నారు…

అలానే, ఈరోజు కూడా తన హృదయం లోని బాధను సోషల్ మీడియా లో బయట పెట్టారు…

“నా హృదయంలో నివసిస్తున్న అందరికీ వందనాలు. కల్పనకూ అందని విధంగా నిన్న కరూరులో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటే హృదయం కూడా, మనసు కూడా భారం మోసినట్టుగా మారిపోయింది. మన ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో మునిగిపోయిన ఈ సమయంలో, నా మనసు అనుభవిస్తున్న బాధను మాటల్లో చెప్పలేను. నేను కలిసిన మీ అందరి ముఖాలు నా మనసులో మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. నాకు ప్రేమ, మమకారం చూపిన నా బంధువులను గుర్తు చేసుకుంటే హృదయం మరింత కలత చెందుతోంది.”

అతను బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తూ, ఇలా తెలిపారు:
“ఇది భర్తీ చేయలేని అపార నష్టం. ఎవరు ఎంతటి పరామర్శ మాటలు చెప్పినా, మన ప్రియమైన వారి లోటును భరించడం అసాధ్యం. అయినప్పటికీ, మీ కుటుంబానికి చెందిన వాడిగా, ఈ క్లేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి ₹20 లక్షల చొప్పున, అలాగే గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి ₹2 లక్షల చొప్పున అందించాలని నేను సంకల్పించాను. ఈ నష్టానికి ఇది పెద్ద పరిహారం కాదని నాకు తెలుసు. అయినప్పటికీ, ఈ కష్ట సమయంలో మీతో నిలబడటం నా బంధుత్వ ధర్మంగా భావిస్తున్నాను.”

అంతేకాదు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ, అవసరమైన సహాయాన్ని తమిళనాడు Tamil Nadu Vetrik Kazhagam అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

చివరగా ఆయన భగవంతుని ఆశీర్వాదంతో ఈ దుస్థితి నుండి అందరూ బయటపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *