గ్రామదేవతగా పుంగనూరులో వెలసిన మారెమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజైన నేడు అమ్మవారిని వేపాకు పచ్చడితో అలంకరించారు. వేపాకును మెత్తగా నూరి అమ్మవారికి ముఖానికి రాసి, వేపదండలు, పూలమాలలతో అలంకరించారు. పలురకాలైన వ్యాధులు, మహమ్మారుల నుంచి అమ్మవారు రక్షిస్తారని, ఇందులో భాగంగానే దసరా నవరాత్రుల్లో తొమ్మిదో రోజున అమ్మను ఇలా అలంకరిస్తారని పూజారులు చెబుతున్నారు. ఏడాదిలో ఒక్కమారు అదీ కూడా తొమ్మిదో రోజు మాత్రమే ఇటువంటి అలంకరణ ఉంటుంది. ఈ ఒక్కరోజు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే ఏడాదిపాటు ఇబ్బందులు, రోగాల బారినుంచి బయటపడొచ్చని భక్తులు చెబుతున్నారు. దీనికోసమే తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో మారెమ్మ ఆలయానికి వస్తారు. అయితే, అమ్మవారికి అలంకరణ పూర్తయ్యాకే సామాన్య భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇస్తారు.
Latest News, Analysis, Trending Stories in Telugu