కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి తెలిసిందే. అధిష్టానం జోక్యంతో ఈ కుమ్ములాటలకు చెక్ పడింది. కాగా, తాజాగా మరోసారి ఇంటి గొడవలు రచ్చకెక్కడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై కర్ణాటక మంత్రి రాజన్న స్పందించిన తీరు సరిగా లేదనే కారణంగా ఆయన్ను పదవి నుంచి తప్పించింది. పార్టీ నుంచి తప్పించడంతో ఆయన వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్దమౌతున్నారని, కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరబోతున్నారని, బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి రాజన్న కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెసీ బాలకృష్ణ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నేత, రాజన్న కుమారుడు రాజేంద్ర రాజన్న తిప్పికొట్టారు. బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో హెసీ బాలకృష్ణ కూడా ఉన్నారని, ఆయనే కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రికి పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. చాలా కాలం తరువాత మరోసారి రాజకీయంగా కర్ణాటకలో దుమారం రేగడంతో ఈ దుమారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
Related Posts
పలమనేరు ప్రజల వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Spread the loveSpread the loveTweetచిత్తూరు జిల్లా, పలమనేరు లోని కుంకీ ఏనుగుల క్యాంప్ సందర్శన ఇంకా అటవీ శాఖ అధికారులతో సమీక్షలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా పలమనేరు చేరుకున్న…
Spread the love
Spread the loveTweetచిత్తూరు జిల్లా, పలమనేరు లోని కుంకీ ఏనుగుల క్యాంప్ సందర్శన ఇంకా అటవీ శాఖ అధికారులతో సమీక్షలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా పలమనేరు చేరుకున్న…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది?
Spread the loveSpread the loveTweet2024 ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దశ మొదలైంది. టిడిపి – బీజేపీ – జనసేన కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి…
Spread the love
Spread the loveTweet2024 ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దశ మొదలైంది. టిడిపి – బీజేపీ – జనసేన కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి…
రాష్ట్రపతి స్వతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కీలక అంశాలు
Spread the loveSpread the loveTweetరాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని యధాతథంగా ఇక్కడ అందిస్తున్నాము.…
Spread the love
Spread the loveTweetరాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని యధాతథంగా ఇక్కడ అందిస్తున్నాము.…