బడ్జెట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్…

Pawan Kalyan Responds to Distressed Woman in Muscat, Orders Immediate Rescue EffortsPawan Kalyan Responds to Distressed Woman in Muscat, Orders Immediate Rescue Efforts

రైతుల సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌లను పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.10 వేల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారి భవిష్యత్తు భద్రత కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ధైర్యం చెప్పారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే ఒకేసారి పది వేల మందికి పదోన్నతులు ఇవ్వడం ద్వారా పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *