రైతుల సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్లను పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.10 వేల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారి భవిష్యత్తు భద్రత కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ధైర్యం చెప్పారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే ఒకేసారి పది వేల మందికి పదోన్నతులు ఇవ్వడం ద్వారా పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Related Posts
బడ్జెట్పై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతున్నది?
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2026 కేంద్ర బడ్జెట్పై ఈసారి జ్యోతిష్య వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గ్రహాల కదలికలు, రాశి…
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2026 కేంద్ర బడ్జెట్పై ఈసారి జ్యోతిష్య వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గ్రహాల కదలికలు, రాశి…
మేడారంలో తెలంగాణ సీఎం తులాభారం… సమ్మక్క–సారలమ్మకు 68 కిలోల బెల్లం సమర్పణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క–సారలమ్మలను కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని, తొలి మొక్కును భక్తిశ్రద్ధలతో సమర్పించారు. రాష్ట్ర ప్రజల తరఫున దేవతలకు మొక్కులు చెల్లిస్తూ,…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క–సారలమ్మలను కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని, తొలి మొక్కును భక్తిశ్రద్ధలతో సమర్పించారు. రాష్ట్ర ప్రజల తరఫున దేవతలకు మొక్కులు చెల్లిస్తూ,…
యువత క్రీడలను వదిలేస్తే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది: గచ్చీబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేస్తున్నారన్న అంశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. యువతను…
దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేస్తున్నారన్న అంశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. యువతను…