హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం – ప్రయాణికుల సౌకర్యాలపై సమీక్ష

CM Revanth Reddy Orders Improvement of MMTS Services and Connectivity in Hyderabad

హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ గారు చెప్పారు. కార్యాల‌యాల స‌మ‌యాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచ‌డంతో పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా స‌మ‌య పాల‌న పాటిస్తూ స‌ర్వీసులను న‌డ‌పాల‌ని ఆదేశించారు.

✅#MMTS స‌ర్వీసుల‌పై శాన‌స‌మండ‌లి హాల్‌లో ముఖ్య‌మంత్రి గారు స‌మీక్ష నిర్వ‌హించారు. ఎంఎంటీఎస్‌లో ప్ర‌యాణికుల త‌గ్గుముఖంపై ముఖ్య‌మంత్రి గారు ఆరా తీశారు.

✅ప్రధానంగా ఎంఎంటీఎస్ స్టేష‌న్ల వ‌ద్ద‌కు ఆర్టీసీ బ‌స్సులు వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డం, స్టేష‌న్లు లోప‌లికి ఉండటంతో అక్క‌డ‌కు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా మినీ బ‌స్సులు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించారు. ఎంఎంటీఎస్ స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికులకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

Image

✅మెరుగైన వ‌స‌తులు ఉన్న‌ప్పుడే ప్ర‌యాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతార‌ని తెలిపారు. స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని అధికారుల‌కు సూచించారు.

✅లాస్ట్ మైల్ క‌నెక్టివిటీ పెంపుతో పాటు ప్ర‌యాణికుల సంఖ్య పెంపు, వ‌స‌తులు మెరుగుపరచడానికి ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్యమంత్రి గారు అధికారుల‌ను ఆదేశించారు.

✅స‌మీక్ష‌లో ర‌వాణా శాఖ మంత్రి పొన్నం గారు, కె.రామ‌కృష్ణారావు గారితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *