విజయనగరం కల్పవల్లి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి వస్తున్నారు. వచ్చే ఏడాది వరకు అమ్మవారి ఆలయం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని, కొన్ని కారణాల వలన గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖాలు కలుగుతాయని, ఈతిబాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు.
Related Posts
మెగా ఫామిలీ మీద ట్రోల్ల్స్: లావణ్య త్రిపాఠి గట్టి కౌంటర్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ట్విన్స్ పుట్టిన సందర్భంగా మెగా ఫామిలీ చాల హ్యాపీ హాపీ గా ఉంది… కానీ ఈ హ్యాపీ టైం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ట్విన్స్ పుట్టిన సందర్భంగా మెగా ఫామిలీ చాల హ్యాపీ హాపీ గా ఉంది… కానీ ఈ హ్యాపీ టైం…
హైదరాబాద్లో 50 లక్షలకే ఇండిపెండెంట్ ఇల్లు… ఎక్కడో తెలుసా?
హైదరాబాద్ అంటేనే ఆకాశాన్ని తాకే భూముల ధరలు, కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనే భావన బలంగా తీసుకుంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్ రంగం కూడా…
హైదరాబాద్ అంటేనే ఆకాశాన్ని తాకే భూముల ధరలు, కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనే భావన బలంగా తీసుకుంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్ రంగం కూడా…
2025లో ఎక్కువమంది సెర్చ్ చేసిన బెస్ట్ ఫోన్స్ ఇవే
2025 సంవత్సరంలో స్మార్ట్ఫోన్ మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్ చేసిన బెస్ట్ ఫోన్స్గా కొన్ని ప్రత్యేక మోడళ్లు ట్రెండ్ అయ్యాయి. పనితీరు,…
2025 సంవత్సరంలో స్మార్ట్ఫోన్ మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్ చేసిన బెస్ట్ ఫోన్స్గా కొన్ని ప్రత్యేక మోడళ్లు ట్రెండ్ అయ్యాయి. పనితీరు,…