విజయనగరం కల్పవల్లి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి వస్తున్నారు. వచ్చే ఏడాది వరకు అమ్మవారి ఆలయం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని, కొన్ని కారణాల వలన గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖాలు కలుగుతాయని, ఈతిబాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు.
Related Posts
కాంగ్రెస్ కామారెడ్డి సభ ఆంతర్యం ఏంటి?
ఈనెల 15వ తేదీన జరగబోయే కామారెడ్డి సభకు తెలంగాణ రాజకీయ వర్గాల్లో భారీ ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే జరిగిన సన్నాహక సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్…
ఈనెల 15వ తేదీన జరగబోయే కామారెడ్డి సభకు తెలంగాణ రాజకీయ వర్గాల్లో భారీ ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే జరిగిన సన్నాహక సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్…
2026లో భారత్లో ఏం జరగబోతున్నది? వంగాబాబా చెప్పింది నిజమౌతుందా?
భవిష్యత్తును ఊహించి ముందుగానే చెప్పడం అందరికీ సాధ్యమయ్యేపని కాదు. భగవంతుని ఆశీస్సులు, అదృష్టం ఉంటేనే కాలజ్ఞానం చెప్పగలరు. అటువంటివారిలో పోతులూరి వీరబ్రహ్మం, ఆమ్స్టర్డామ్, వంగబాబా ముందు ఉంటారు.…
భవిష్యత్తును ఊహించి ముందుగానే చెప్పడం అందరికీ సాధ్యమయ్యేపని కాదు. భగవంతుని ఆశీస్సులు, అదృష్టం ఉంటేనే కాలజ్ఞానం చెప్పగలరు. అటువంటివారిలో పోతులూరి వీరబ్రహ్మం, ఆమ్స్టర్డామ్, వంగబాబా ముందు ఉంటారు.…