విజయనగరం కల్పవల్లి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి వస్తున్నారు. వచ్చే ఏడాది వరకు అమ్మవారి ఆలయం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని, కొన్ని కారణాల వలన గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖాలు కలుగుతాయని, ఈతిబాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు.
Related Posts
అక్టోబర్ 4న ఎవరి జాతకం ఎలా ఉందంటే
మేషరాశి (Aries) కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పనిలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో చిన్న సంతోషకరమైన సంఘటన జరగవచ్చు. సహచరుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో…
మేషరాశి (Aries) కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పనిలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో చిన్న సంతోషకరమైన సంఘటన జరగవచ్చు. సహచరుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో…
మోదీ కీలక నిర్ణయం… ఆసియన్ ఇండియా సమ్మిట్కు వర్చువల్గా హాజరు
ఈనెల 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్లో జరగనున్న ఆసియన్ ఇండియా సమ్మిట్కు ప్రధాని మోదీ వర్చువల్గా హాజరుకాబోతున్నారు. ఆయ వీడియో కాన్ఫరెన్స్ద్వారా తన ప్రసంగాన్ని…
ఈనెల 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్లో జరగనున్న ఆసియన్ ఇండియా సమ్మిట్కు ప్రధాని మోదీ వర్చువల్గా హాజరుకాబోతున్నారు. ఆయ వీడియో కాన్ఫరెన్స్ద్వారా తన ప్రసంగాన్ని…
రాఖీ పౌర్ణమి విశిష్టత ఇదే
రాఖీ పౌర్ణమి, శ్రావణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకునే ఒక పవిత్రమైన హిందూ పండుగ, సోదరీసోదరుల మధ్య బంధాన్ని గౌరవించే ప్రత్యేక సందర్భం. ఆగస్టు…
రాఖీ పౌర్ణమి, శ్రావణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకునే ఒక పవిత్రమైన హిందూ పండుగ, సోదరీసోదరుల మధ్య బంధాన్ని గౌరవించే ప్రత్యేక సందర్భం. ఆగస్టు…