లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో…

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో బీజేపీ ఓ అద్భత నిర్మాణాన్ని చేపట్టింది. కమలం ఆకృతిలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 232 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. లోటస్‌ సింబర్‌ ఆకృతిలో ఉండే స్థలంలో రాష్ట్ర ప్రెరణ స్థల్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ బీజేపీ ఏర్పాటులో ముఖ్యభూమికను పోషించిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, డాక్టర్‌ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీల కాంశ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా బీజేపీకి వన్నె తెచ్చిన మొదటితరం నాయకుడు, దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కట్టడం వాజ్‌పేయి జయంతి సందర్భంగా డిసెంబర్‌ 25న ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈ కట్టడాన్ని ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *