దేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కేరళ వెళ్లి అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్ ద్వారా కొంతదూరం ప్రయాణించి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. కాగా, నిన్నటి రోజున ఢిల్లీ నుంచి కేరళ వెళ్లిన ద్రౌపది ముర్మును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి దీక్షా వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఒక వయసు దాటిని మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చు అనే విధానం ద్వారానే తాను శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్టుగా తెలిపారు. రాష్ట్రపతి ముర్ము శబరిమల ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలు వేరు, భక్తి వేరని… దైవం ముందు అందరూ సమానమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Related Posts
జూనియర్ ఎన్టీఆర్ అమెరికా కాన్సులేట్ సందర్శన – కొత్త లుక్తో అభిమానులను ఆశ్చర్యపరిచిన యంగ్ టైగర్…
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక ఫోటో అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. టాలీవుడ్ బిజీ హీరోలలో ఒకడైన ఎన్టీఆర్ తరచుగా…
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక ఫోటో అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. టాలీవుడ్ బిజీ హీరోలలో ఒకడైన ఎన్టీఆర్ తరచుగా…
రామ్చరణ్ పెద్ది మైసూర్ షూటింగ్ విశేషాలు ఇవే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా “పెద్ది” ప్రస్తుతం మైసూర్లోని అద్భుతమైన లొకేషన్లలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా “పెద్ది” ప్రస్తుతం మైసూర్లోని అద్భుతమైన లొకేషన్లలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత…