దేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కేరళ వెళ్లి అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్ ద్వారా కొంతదూరం ప్రయాణించి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. కాగా, నిన్నటి రోజున ఢిల్లీ నుంచి కేరళ వెళ్లిన ద్రౌపది ముర్మును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి దీక్షా వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఒక వయసు దాటిని మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చు అనే విధానం ద్వారానే తాను శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్టుగా తెలిపారు. రాష్ట్రపతి ముర్ము శబరిమల ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలు వేరు, భక్తి వేరని… దైవం ముందు అందరూ సమానమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Related Posts
గద్దెనెక్కి రెండేళ్లకు చేరువ… జ్వరాలొస్తే మాకేం సంబంధం అంటారా….?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ…
మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల జల్లు కురిపించిన టాలీవుడ్ ప్రముఖులు…
భారత రాజకీయాల్లో అద్భుతమైన దూరదృష్టి, అసాధారణ కట్టుబాటు, నిరంతర శ్రమతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల జల్లు…
భారత రాజకీయాల్లో అద్భుతమైన దూరదృష్టి, అసాధారణ కట్టుబాటు, నిరంతర శ్రమతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల జల్లు…
శ్రీవారి పుష్కరిణి వద్ధ భారీ క్యూ
బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో పాటు, విజయదశమి కూడా కావడంతో శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అర్థరాత్రి నుంచే…
బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో పాటు, విజయదశమి కూడా కావడంతో శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అర్థరాత్రి నుంచే…