శంషాబాద్ నుంచి ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ క్యాబ్స్ను ఏర్పాటు చేసింది. మహిళలే డ్రైవర్లుగా ఉండే ఈ షీక్యాబ్స్లో పురుషులకు అనుమతి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మహిళతో పాటు భర్త ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. కేవలం పురుషులకు ఈ క్యాబ్లు అందుబాటులో ఉండవు. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది నగరం నుంచి శంషాబాద్కు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలను క్యాబ్ డ్రైవర్లు బెదిరించి దోచుకోవడం, అత్యాచారం చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షీక్యాబ్లు నిత్యం పది వరకు శంషాబాద్లో అందుబాటులో ఉంటాయి. నాలుగు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
Related Posts
వైఎస్ఆర్ అభిమానులను మర్చిపోనివ్వని పావురాలగుట్ట
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అజరామరమైన నాయకుడిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పేరు వినగానే ప్రజలు గుర్తు చేసుకునే అంశాలు – రైతు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అజరామరమైన నాయకుడిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పేరు వినగానే ప్రజలు గుర్తు చేసుకునే అంశాలు – రైతు…
నిరుద్యోగులకు టీజీఆర్టీసీ గుడ్న్యూస్
ఉద్యోగార్థులకు ఇది నిజంగా ఒక శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్దఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈసారి తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో…
ఉద్యోగార్థులకు ఇది నిజంగా ఒక శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్దఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈసారి తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో…