తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు ముగిసిన తరువాత కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఆదివారం రోజున శ్రీవారిని 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,872 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం రోజున భక్తుల రద్దీ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉచిత దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, రూ. 300 టికెట్ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఆదివారం రోజున హుండీ ద్వారా రూ. 4.06 కోట్ల ఆదాయం లభించింది.
Related Posts
మెస్సీతో ఫొటో…చాలా కాస్ట్లీ గురూ
లియోనెల్ మెస్సీ భారత పర్యటన సందర్బంగా హైదరాబాద్ సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో అగ్రగామిగా నిలిచిన ఈ దిగ్గజ ఆటగాడు G.O.A.T…
లియోనెల్ మెస్సీ భారత పర్యటన సందర్బంగా హైదరాబాద్ సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో అగ్రగామిగా నిలిచిన ఈ దిగ్గజ ఆటగాడు G.O.A.T…
దుర్గాదేవి 11 అలంకరణల రహస్యం ఇదే
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 10 రోజుల్లో 11 రకాలైన అలంకరణలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ 11 రకాలైన అలంకరణల వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు…
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 10 రోజుల్లో 11 రకాలైన అలంకరణలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ 11 రకాలైన అలంకరణల వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు…
రాశిఫలాలు – ఈరోజు ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి
మేషరాశి (Aries):చంద్రుడు మీ రాశిలో సంచరిస్తున్నందున ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. పనుల పట్ల చురుకుదనం ఉంటుంది. అనుకోని ఆహ్వానం రావచ్చు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ…
మేషరాశి (Aries):చంద్రుడు మీ రాశిలో సంచరిస్తున్నందున ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. పనుల పట్ల చురుకుదనం ఉంటుంది. అనుకోని ఆహ్వానం రావచ్చు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ…