తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు ముగిసిన తరువాత కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఆదివారం రోజున శ్రీవారిని 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,872 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం రోజున భక్తుల రద్దీ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉచిత దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, రూ. 300 టికెట్ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఆదివారం రోజున హుండీ ద్వారా రూ. 4.06 కోట్ల ఆదాయం లభించింది.
Related Posts
అష్టోత్తర శతనామావళి పఠించేముందు పాటించవలసిన నియమాలు
మనం పూజించే దేవతలకు మనం పిలుచుకునే నామంతో పాటు మరో 108 నామాలు ఉంటాయి. ఆ నామాలనే అష్టోత్తర శతనామాలు అంటారు. ఈ అష్టోత్తర శతనామాలను రాగయుక్తంగా…
మనం పూజించే దేవతలకు మనం పిలుచుకునే నామంతో పాటు మరో 108 నామాలు ఉంటాయి. ఆ నామాలనే అష్టోత్తర శతనామాలు అంటారు. ఈ అష్టోత్తర శతనామాలను రాగయుక్తంగా…
పంచాంగం – ఈరోజు శుభ సమయాలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం,శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష చతుర్దశి తిథి మ.03.44 వరకూ తదుపరి అమావాస్య తిథి, హస్తా నక్షత్రం రా.08.17…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం,శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష చతుర్దశి తిథి మ.03.44 వరకూ తదుపరి అమావాస్య తిథి, హస్తా నక్షత్రం రా.08.17…