ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రైవేటుపరం చేయడం వలన పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడతారని, టాలెంట్ ఉన్నా వారి నుంచి వైద్యవిద్య దూరమౌతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కానివ్వకూడదనే ఉద్దేశంతో వైసీపీ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నది. వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద ఈ నిరసనలు చేపట్టనున్నారు. మెడికల్ కాలేజీ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు. #SaveMedicalCollegesInAP, #YSRCPForMedicalStudents వంటి హ్యాష్ ట్యాగ్లను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది. మరి ఈ నిరసనలపై కూటమి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
Related Posts
రామ్ చరణ్కు గాయంపై ‘పెద్ది’ టీమ్ క్లారిటీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడినట్లు వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ టీమ్ అధికారికంగా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడినట్లు వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ టీమ్ అధికారికంగా…
విజయనగరం లో ఎన్టీఆర్ వర్ధంతి…కూటమి ఎమ్మెల్యే ఆదితీ ఆధ్వర్యంలో కార్యక్రమం
తెలుగు వాడి కీర్తి దశ దిశల వ్యాపింప చేసిన మహోన్నవ్యక్తి,కృష్ణుడు,రాముడు ఇలానే ఉంటాడని చూపించిన మహానటుడు, తెలుగు రాజకీయాలను ప్రపంచానికి చెప్పిన రాజనీతిజ్ఞుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు…
తెలుగు వాడి కీర్తి దశ దిశల వ్యాపింప చేసిన మహోన్నవ్యక్తి,కృష్ణుడు,రాముడు ఇలానే ఉంటాడని చూపించిన మహానటుడు, తెలుగు రాజకీయాలను ప్రపంచానికి చెప్పిన రాజనీతిజ్ఞుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు…
పాక్కు బిగ్షాక్ః ఆఫ్ఘాన్కు భారత్ అండ
ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఆఫ్గాన్ రాజధాని కాబూల్లో పాక్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఈ దాడులను ఆ దేశం తీవ్రంగా ఖండించింది.…
ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఆఫ్గాన్ రాజధాని కాబూల్లో పాక్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఈ దాడులను ఆ దేశం తీవ్రంగా ఖండించింది.…