నిన్న రాత్రి మన ఇండియన్ క్రికెట్ టీం అద్భుతాన్ని చాల సునాయాసంగా చేసి చూపించారు… T20 వరల్డ్ కప్ ని మూడో సారి గెలిచి, భారత క్రికెట్ టీం ని ఎందుకు వరల్డ్ నెంబర్ వన్ టీం అంటారో చేసి చూపించారు… మొదటి టాస్ ఓడిపోయినా కానీ బాటింగ్ చేసి 250 ప్లస్ పరుగులు చేసి కొండంత లక్ష్యాన్ని కివీస్ ముందు పెట్టారు…
అలానే కివీస్ కూడా ఆ లక్ష్యానికి బయపడింది ఏమో, మొదట పవర్ ప్లే లోనే మూడు వికెట్స్ కోల్పోయారు… ఆ తరవాత ఏ దశలోనూ గెలిచే స్థితిలో లేదు! అందుకే మనం 95 రన్స్ పైగా తేడా తో గెలిచి కప్పు మళ్ళి సొంతం చేసుకుంది ఇండియా!
నిన్న ఇండియన్ టీం గెలిచినప్పటి నుంచి, మొత్తం భారత దేశం గర్విస్తుంది… అలానే మన టీం కి శుభాకాంక్షలు చెప్తున్నారు… PM మోడీ తో పాటు చాల మంది ఫిలిం సెలబ్రిటీస్ కూడా మన టీం ని అభినందించారు!
ఇక AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా మన టీం ని అభినందించారు!