హైదరాబాద్ లో ప్రముఖ న్యాయవాది,హైదరాబాద్ బార్ కౌన్సల్ మెంబర్ ,ప్యామిలీ,క్రైమ్,సివిల్ కేసుల వాదనలో దిట్ట అయిన మల్లావజ్జుల మణిశేఖర్ 2026 ఎక్సలెన్స్ గ్లోబల్ అవార్డకు ఎంపికయ్యారు. ఆయనతో పాటు ఆయన స్నేహితుడు పార్వతీపురం వాసి ప్రముఖ లాయర్ గొల్ల రాజుకు కూడా అవార్డకు ఎంపికయ్యారు. హైదరాబాద్ లో ఉంటున్న అడ్వకేట్ మణిశేఖర్ పలు లీగల్ కేసులకు ఇట్టే పరిష్కారం చూపారు. అలాగే ప్యామిలీ తగాదాలను ఇరు పార్టీలకు ఇబ్బందులు లేకుండా,కలగకుండా రాజీ కుదిర్చే విధంగా సమస్యలను పరిష్కరించడంలో మహామేదావి.
దాంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ,హైందవ సంస్క్రతిని ఫరిడవిల్లే ఎలాంటి కార్యక్రమాలైనా అలాంటి కేసులలో ప్రత్యేకంగా ముందుకొచ్చి దేశ హితం ధర్మం, సంప్రదాయం కోసం వాదనలు చేసి మరీ అలాంటి కేసులను డబ్బులు తీసుకోకుండా ఇట్టే పరిష్కరిస్తారు. మణిశేఖర్ అర్ధాంగి పద్మజ కూడా భర్త మణిశేఖర్ తో తోడు,చేదోడుగా ఉంటూ కేసులను పరిష్కరించడంలో ముందుండటం విశేషం.