పౌర్ణమి గరుడసేవకు ఏర్పాట్లు పూర్తి

తిరుమలలో ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవను ఘనంగా నిర్వహిస్తుంటారు. కాగా, అక్టోబర్‌ 7వ తేదీన పౌర్ణమి తిథి కావడంతో గరుడ సేవను నిర్వహించేందుకు టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరెరగనున్నారు. గరుడ వాహనంలో భక్తులను కటాక్షించేందుకు మాడవీధుల్లోకి వచ్చే స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం నుంచే మూలవిరాట్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. ఉదయం మూలవిరాట్‌ను, రాత్రికి మలయప్ప స్వామిని దర్శించుకుంటే జన్మ తరిస్తుందని భక్తుల నమ్మకం.

రాశిఫలాలు – పూర్ణిమ రోజున ఈ రాశులవారిదే అదృష్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *