సోనియాగాంధీకి అస్వస్థత

Sonia Gandhi Hospitalised in Delhi After Severe Cough, Health Condition Stable

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీలోని ప్రముఖ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియా గాంధీకి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. నివేదికల ప్రకారం, గత కొన్ని రోజులుగా ఆమె దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతుండగా, ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ తాజాగా నిర్వహించిన అధ్యయనం కలవరపెట్టే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. గాలిలో మందులకు లొంగని ప్రమాదకరమైన బ్యాక్టీరియా స్థాయి పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత పెరగడంతో ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో నగరాన్ని విడిచి వెళ్లాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది.

Also Read  హోమ్‌గార్డ్‌ ఉద్యోగంతో 20 కోట్ల సంపాదన.. నోరెళ్లబెడుతున్న అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *