దేవాలయానికి వెళ్లిన సమయంలో పూజారి మనకు తీర్థం ఇస్తారు. తీర్థాన్ని గోకర్ణముద్ర వేసి తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తరువాత చాలా మంది చేతిని తలకు రాసుకుంటారు. జ్యోతిష్య, హైందవ సంప్రదాయాల ప్రకారం తీర్థం పవిత్రమైన జలం. దీనినే గంగాజలం అని కూడా పిలుస్తాం. భగవంతుడిని అభిషేకించిన తరువాత పవిత్రంగా మారిన జలాన్ని తీర్థంగా భక్తులకు అందిస్తారు. తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలకు రాయడం ఓ అలవాటుగా మారింది. అయితే, ధర్మశాస్త్రాల ప్రకారం చేతిని తలపై త్రిపుండ్రం లేదా నమస్కారానికి సూచనగా రాయడం ద్వారా శుద్ధి, క్షమాపణ, దైవకృప పొందేందుకు సూచనగా చెబుతారు. తీర్థం అనేది ప్రసాదంగా చెబుతారు కాబట్టి దానిని తలపై ఉంచడం కూడా శుభదాయకమనే చెప్పాలి. ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూసుకుంటే తీర్థం భౌతిక, మానసిక శరీరాన్ని శుద్ధి చేస్తుంది. పుణ్యఫలాలను ఇస్తుంది. మనిషి తలపై బ్రహ్మరంధ్రం ఉంటుంది. దీనినే శక్తికేంద్రంగా చెబుతాం. తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలపై రాయడం వలన బ్రహ్మకేంద్రానికి ఆధ్యాత్మిక శక్తి అందుతుందని, పాపాలు క్షమించబడతాయని చెబుతారు. తీర్థం తీసుకున్న తరువాత ఎవరు తలపై చేతిని రాయకూడదు అనే దానిపై కూడా శాస్త్రాలు కొన్ని వివరణలు ఇచ్చాయి. మనసు మాలిన్యంతో నిండిపోయినవారు, భగవంతునిపై నమ్మకం లేనివారు, పలు రకాలైన చింతలున్నవారు చేతిని తలపై రాకూడదని చెబుతారు.
Related Posts
బాక్సాఫీస్ కొల్లగొడుతున్న వీరభద్రుడు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఎదురుచూసిన భారీ కంబ్యాక్ చివరికి “కరుప్పు” (తెలుగులో ‘వీరభద్రుడు’) రూపంలో దొరికింది. విడుదలైనప్పటి నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఎదురుచూసిన భారీ కంబ్యాక్ చివరికి “కరుప్పు” (తెలుగులో ‘వీరభద్రుడు’) రూపంలో దొరికింది. విడుదలైనప్పటి నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…
Santhana Prapthirasthu Success Meet Live
Post Views: 76
Post Views: 76
బిడ్డపై కాలుష్య ప్రభావం… ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం మాత్రమే కాదు, ఆమె ఊపిరి తీసుకునే గాలి కూడా శిశువు భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం, గాలి, నీరు,…
గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం మాత్రమే కాదు, ఆమె ఊపిరి తీసుకునే గాలి కూడా శిశువు భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం, గాలి, నీరు,…