ఫ్యాన్స్ అందరు బాలకృష్ణ అఖండ 2 కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం థమన్ ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ స్కోర్పై పని ప్రారంభించారు. ఫస్ట్ హాఫ్ స్కోర్ ఇప్పటికే కంప్లీట్ అయింది. సో, ఈ స్కోర్ తో సినిమా ని వేరే లెవెల్ కి తీసుకెళ్తానని అన్నాడు థమన్…
ఈ సీక్వెల్లో నందమూరి బాలకృష్ణ, సమ్యూక్తా మెనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, ప్రసిద్ధ పండితులు శ్రవణ్ మిశ్రా ఇంకా అతుల్ మిశ్రా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పాల్గొననున్నారు. వేద మంత్రాలు ఇంకా శ్లోకాల పఠనం ద్వారా సంగీతానికి ఆధ్యాత్మిక, పవిత్ర టచ్ ఇవ్వనున్నారు.
ఈ న్యూస్ ని థమన్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ కి షేర్ చేస్తూ, ఒక గొప్ప మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నానంటూ చెప్పాడు…